ఎర్రచందనం స్మగ్లింగ్పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. స్మగ్లర్లు తమ కార్యకలాపాలు ఆపి వేయాలని.. వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పవన్ పిలుపునిచ్చారు. లేదంటే టాస్క్ఫోర్స్ ద్వారా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. గత వైసీపీ పాలనలో రూ. 8,000-10,000 కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని పవన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకపై ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.