ఎల్బీనగర్‌లో పల్టీలు కొట్టిన కారు.. ఒక్కసారిగా మంటలు

1 month ago 13
అతివేగం కారణంగా జరిగిన బీభత్సమిది. వేగంగా వచ్చిన కారు.. అదుపుతప్పి ముందున్న డీసీఎంను ఢీకొట్టి, పల్టీ కొడుతూ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు దగ్ధమైంది. ఎల్బీ నగర్ సాగర్ రింగు రోడ్డు వద్ద మార్చి 2న అర్ధరాత్రి సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తిని ఎల్బీ నగర్ రాక్ టౌన్‌కు చెందిన సాయి కీర్తన్‌గా గుర్తించారు. కారులో మంటలు చెలరేగడంతో వాహనంలో ఉన్న సాయి కీర్తన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అతడిని బయటికి తీసి ఎల్బీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article