Ab Venkateswara Rao: కందుకూరు హత్య కేసులో లక్ష్మినాయుడు కుటుంబానికి ప్రభుత్వ సాయంపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యలు, కుల గొడవలపై దృష్టి పెడుతున్నారని, ఏడాదికి 900 హత్యలు జరుగుతుంటే అందరికీ పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చట్టబద్ధత, హేతుబద్ధత లేని నిర్ణయాలతో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్ అయ్యాయి.