Nara Lokesh Challenges Ysrcp On Whatsapp: ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లిలో పర్యటిస్తున్నారు.. మంగళవారం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. వాట్సాప్ గవర్నెన్స్లో డేటాచౌర్యం చేస్తారంటూ వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి ఛాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తానన్నారు. ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా తానే చెక్ ఇస్తానన్నారు. తనకు ఫోనే లేదని మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన జగన్.. ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.