ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది, కార్మికులను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్ను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు. టన్నెల్స్ నిర్మించే, ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేసే నిపుణులను తీసుకువచ్చి.. వారి సాయం తీసుకుంటున్నట్లు వివరించారు. అదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి ఉత్తమ్.. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేసేవారి గురించి తాను మాట్లాడాలని అనుకోవట్లేదని పేర్కొన్నారు.