ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. ఓవైపు టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతుండగానే.. ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎస్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారణం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే కారణమని తీన్మార్ మలన్న సంచలన ఆరోపణలు చేశారు.