ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. లోపలే చిక్కుకున్న ఏడుగురు కార్మికులు

1 year ago 22
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో.. 14 కిలోమీటర్లు దాటిన తర్వాత సుమారు 3 మీటర్ల మేర పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా.. చాలా మంది లోపలే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో సుమారు 35 మంది కార్మికులున్నట్టు తెలుస్తోంది. వారిలో 28 మంది బయటపడగా.. మరో ఏడుగురు లోపలే చిక్కుకున్నారు. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.
Read Entire Article