టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఎంత విరాళాలు అందాయనే దానిపై టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు, టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు విరాళాలు రూ.2200 కోట్లు దాటినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. రోజుకు రెండు వేల మందికి అన్నదానం చేసే స్థాయి నుంచి ప్రస్తుతం రోజుకు లక్ష మందికి అన్నప్రసాదం వితరణ చేసే స్థాయికి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు చేరుకుందని బీఆర్ నాయుడు తెలిపారు.