ఎస్సీ, ఎస్టీ కేసు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేశారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 89 మంది బాధితులకు పత్రాలను అందించారు. 2014 నుంచి 2025 వరకు బాధితులుగా ఉన్నవారికి పత్రాలు అందించారు.