ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీపికబురు వినిపించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కొత్తగా ఏడు ఐఐటీ, నీట్ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివి నీట్, ఐఐటీ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులను చంద్రబాబు అభినందించారు.55 మంది విద్యార్థులకు లక్ష చొప్పున ప్రోత్సాహకం, జ్ఞాపికలు అందజేశారు.