సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ రాష్ట్రానికి డీజీపీ అవుతాడేమో అన్న అక్కసుతోనే సునీల్ కుమార్ను సస్పెండ్ చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ విదేశాలకు వెళితే లేని తప్పు.. సునీల్ కుమార్ వెళితే ఎందుకు వచ్చిందన్నారు.