ఏపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న వారికి అద్భుత అవకాశం ఇస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా రుణం మొత్తాన్ని చెల్లించిన వారికి వడ్డీ మాఫీ పథకం అమలు చేస్తోంది. 2014-19 మధ్యకాలంలో రుణాలు తీసుకున్నవారు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో రుణాల రికవరీ కోసం ఏపీ ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని తీసుకువచ్చింది. ఏప్రిల్ 30 లోగా రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ చేయనున్నారు.