తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి ఆసరా పింఛన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దివ్యాంగులకు రూ.4016, ఒటరి మహిళలకు రూ.2016, గీత కార్మికులకు, వృద్ధులకు నెలకు రూ.2016 చెప్పున అందిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా అకౌంట్ మెయింటెన్ చేస్తున్న వారు.. నేరుగా అకౌంట్లోకి ఈ మనీ క్రెడిట్ అవుతున్నాయి. కానీ.. నెల నెలా కస్టమర్ సర్వీస్ పాయింట్ల దగ్గరకు వెళ్లి తీసుకునే వారికి నిర్వాహకులు రూ.2000 మాత్రమే ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.