పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ కుమారుడికి రైఫిల్ షూటింగ్ ఇచ్చిన ట్రెయినర్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు బాధితులు రాసిన లేఖలు బయటకు వచ్చాయి. అయితే, ఏఈ కుటుంబం మరణానికి ముందు రోజు అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి సమయంలో నిందితుడి తల్లి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.