Telangana Panchayat Elections Unanimous Guidelines: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. అయితే, ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్న మోసాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. వేలంపాట, బెదిరింపులతో జరిగే ఏకగ్రీవాలు చెల్లవని ఈసీ స్పష్టం చేసింది. ఏకగ్రీవాలకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షక విభాగాలు ఏర్పాటు చేసి, ఫిర్యాదులను స్వీకరిస్తామని, స్వచ్ఛందంగానే ఏకగ్రీవాలు జరగాలని తేల్చి చెప్పింది. ఏకగ్రీవంగా ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించింది.