హైదరాబాద్ ఏఐఎన్యూ డాక్టర్లు అద్భుతం చేశారు. ఏడాది బాలుడి కిడ్నీలో ఉన్న రాయిని ఎలాంటి ఆపరేషన్ లేకుండా తొలగించారు. 10 మిల్లీమీటర్ల మందం ఉన్న ఆ రాయిని.. శస్త్రచికిత్స అవసరం లేకుండా దాన్ని పగలగొట్టి పొడి చేసి బయటికి తీసుకువచ్చారు. ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల్లోనే కోలుకున్న బాలుడు.. ఆరోగ్యంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలకు ఆపరేషన్ చేస్తే తట్టుకోలేరని.. అందుకే అత్యాధునిక టెక్నాలజీతో కిడ్నీలో రాయిని తొలగించినట్లు డాక్టర్లు చెప్పారు.