రాష్ట్రంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ధూల్పేట్కు చెందిన 'గంజాయి క్వీన్' నీతూబాయి రోజుకు రూ.4 లక్షల వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించింది. పోలీసుల ఆపరేషన్తో ఏడాదిగా ఆమె పరారీలో ఉన్నా.. దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా పోలీసులు నానక్రామ్గూడలోని ఆమె ఇంట్లో తనిఖీలు చేయగా.. నీతూబాయి కొడుకు, ఇతరులు దొరికినా, ఆమె ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆమె దొరికితేనే ధూల్పేట, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో గంజాయి సరఫరా ఆగుతుందని అంటున్నారు.