ఉమ్మడి చిత్తూరు జిల్లావాసులను ఇబ్బందులు పెడుతున్న ఏనుగుల సమస్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం, ఓ రైతును దాడి చేసి చంపేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పర్యవేక్షించాలని.. అలాగే అవి వెళ్లే మార్గంలోని గ్రామాలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.