ఏనుగుల బీభత్సం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. వాట్సాప్ సాయంతో చెక్!

10 months ago 17
ఉమ్మడి చిత్తూరు జిల్లావాసులను ఇబ్బందులు పెడుతున్న ఏనుగుల సమస్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం, ఓ రైతును దాడి చేసి చంపేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పర్యవేక్షించాలని.. అలాగే అవి వెళ్లే మార్గంలోని గ్రామాలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
Read Entire Article