ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు నవంబర్ 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డీడీఓ) కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఈ నిర్ణయం ప్రకటించారు. పాలనపరమైన సంస్కరణల ఫలితాలు ప్రజలకు చేరాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.