TDP Mlc Bt Naidu Money Theft In Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోము వీర్రాజు (బీజేపీ), కొణిదెల నాగబాబు (జనసేన), బీటీ నాయుడు(టీడీపీ), పేరాబత్తుల రాజశేఖర్(టీడీపీ), ఆలపాటి రాజేంద్రప్రసాద్(టీడీపీ)లతో అసెంబ్లీ భవనంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారం సందర్భంలో దొంగలు రెచ్చిపోయారు. ఎమ్మెల్సీ సహా కొందరి డబ్బుల్ని చోరీ చేశారు.