ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చింది. ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 లేదా మార్చి మూడో తేదీన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఈ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్ వస్తారా.. లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.