ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు క్షమాపణలు చెప్పిన ఏపీ మంత్రి

1 year ago 42
ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. మంత్రులే సభకు ఆలస్యంగా వస్తే ఎలా? సరైన సమయంలో రావడానికి ప్రయత్నించండి.. అని చెప్పారు. తణుకులో ఈఎస్‌ఐ ఆసుపత్రిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే సమయంలో మంత్రి సుభాష్‌ అందుబాటులో లేకపోవడంపై ఆయన ఇలా స్పందించారు. డిస్కంల కొనుగోళ్లలో అక్రమాలపై అడిగిన ప్రశ్నను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కడపలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్న వేశారు. ఆమె విప్‌గా ఉండటంతో ప్రశ్న అడిగేందుకు నిబంధనలు అంగీకరించవని అయ్యన్నపాత్రుడు వివరించారు.
Read Entire Article