Palle Sindhura Reddy English: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించంది. రాష్ట్రంలో బడ్జెట్పై చర్చ సమయంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఇంగ్లీస్లో ప్రసంగించారు. దీంతో రఘురామకృష్ణరాజు జోక్యం చేసుకుంటూ.. ‘తెలుగులో మాట్లాడితే బాగుంటుందని కొందరు సభ్యులు సూచిస్తున్నారు. మీ నియోజకవర్గంలోని ప్రజలకు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సౌకర్యవంతంగా లేకుంటే మీ ఇష్టం’ అన్నారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారు.