AP Assembly Chairmens For Three Committees: ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో మూడు ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీల ఛైర్మన్లను అధికారికంగా ప్రకటించారు. ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్గా పులపర్తి రామాంజనేయులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్గా కూన రవికుమార్, అంచనాల కమిటీ ఛైర్మన్గా వేగుళ్ల జోగేశ్వరరావును నియమించారు.