ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘం నేతలు, మంత్రుల సమావేశం సానుకూలంగా జరిగింది. ఈ నేపథ్యంలో రేపటి ఉద్యమ కార్యాచరణ సన్నద్ధత సమావేశం వాయిదా వేసుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో.. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. త్వరలోనే ఆర్థిక మంత్రి పయ్యావులతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.