ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగవచ్చని మంత్రి నారాయణ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ.. మున్సిపల్ ఎన్నికలపై అప్ డేట్ ఇచ్చారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం కూటమి పార్టీలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాయి. సీఎం చంద్రబాబు సైతం మంత్రులకు దీనిపై దిశానిర్దేశం చేస్తున్నారు.