Guntur Krishna Mlc Election Result: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీచేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 7వ రౌండ్ పూర్తయ్యే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. రాజాకు 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో గెలిచనట్లు ప్రకటించారు. ఏడు రౌండ్లు ముగిసే సరికి ఆలపాటి 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లు పోలవగా, 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. అయితే మంగళవారం 10 గంటలకు కౌంటింగ్ పూర్తవుతుంది.