ఏపీ కూటమి ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయని అన్నారు. అందుకు బీజేపీనే కారణమని చెప్పారు. పవన్ను ముందు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాజకీయ పార్టీలతో లబ్ధి పొంది.. ఆ తర్వాత ఆ పార్టీలను అంతమెుందించాలనేదే బీజేపీ ఎత్తుగడ అని అన్నారు.