ఏపీ కూటమి ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయన్నారు. అందుకు బీజేపీనే కారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి ఏ విధంగా ఆధిపత్యం చెలాయించాలనే దానిపై బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. తన రాజకీయ మిత్రులతో రాజకీయ లబ్ధి పొంది.. అదే రాజకీయ పార్టీని అంతమొందించాలనేదే బిజెపి ఎత్తుగడ అని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో కయ్యం తమ మనగడకు కష్టమనే విషయం బీజేపీకి తెలుసునని చెప్పారు. బీజేపీకి ప్రస్తుతం పూర్తి స్థాయి మెజార్టీ లేదని... ఆ పార్టీ వ్యవహరించే శైలితో చంద్రబాబుతో పాటుగా.. బీఆర్ఎస్ సీఎం నితీష్ కుమార్తో ప్రమాదం రావచ్చునని అన్నారు.