AP Govt Funds Release to Farmers: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ క్రమంలోనే రైతులకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్ వినిపించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బకాయిల డబ్బులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ధాన్యం పాత బకాయిలు రూ. వేయికోట్లు ఉండగా.. అందులో రూ. 672 కోట్ల నిధులు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.