AP Village Ward Sachivalayam Employees Notional Increment: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై అధికారులతో జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆన్లైన్ సెలవు విధానం, హార్డ్వేర్ సమస్యలపై చర్చించారు. ఇంటింటికీ సేవలు అందించాలనే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగుల పదోన్నతులపై 10 మంది మంత్రులతో ఉప సంఘం కూడా ఏర్పాటు చేశారు. ఈ మంత్రుల కమిటీ ప్రమోషన్లపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది.