ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. హోమ్స్టేలు, మెరుగైన రవాణా సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించాలని చూస్తోంది. తాజాగా, యోగా గురువు రామ్దేవ్ బాబాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి రాందేవ్ బాబా కూడా సానుకూలంగా స్పందించారు. బాబా రాందేవ్ సహకారంతో రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది!