పార్కింగ్ విషయం.. రెండు రాష్ట్రాల ఆర్టీసీ డ్రైవర్ల మధ్య గొడవకు కారణమైంది. ఆ గొడవ కాస్తా ఓ డ్రైవర్ మరో డ్రైవర్ మీద దాడి చేసే వరకూ వెళ్లింది. పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవలో ఏపీ ఆర్టీసీ డ్రైవర్పై కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదాడు. బెంగళూరులో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ అయ్యింది. కర్ణాటక అధికారులకు ఫిర్యాదు చేయగా.. కర్ణాటక ఆర్టీసీ అధికారులు దాడి చేసిన డ్రైవర్ను సస్పెండ్ చేశారు.