ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు రోజు రోజుకూ జఠిలమవుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ వివాదం పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంది. నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఏపీ సర్కారు ప్రతిపాదించగా, సభ్యుల పేర్లను సూచించాలని ఇరు రాష్ట్రాలను కేంద్రం కోరింది. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ సమాచారం సేకరిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోకుండానే 296 టీఎంసీల నీటిని వాడుతోందని ఏపీ ఆరోపిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని, మిగులు జలాలనే తరలిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.