కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను ఏపీ దేవాదాయ శాఖ విధుల నుంచి తొలగించింది. గతంలో కాణిపాకం ఆలయం వద్దనున్న టికెట్ కౌంటర్లు, విరాళాల సేకరణ కేంద్రాలను ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో విధులలో నిర్లక్ష్యం వహించిన, అధికంగా నగదు కలిగి ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, తాత్కాలిక బ్యాంక్ ఉద్యోగులు ఎనిమిది మందిని తాజాగా ఏపీ దేవాదాయ శాఖ అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.