ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు 'నైపుణ్యం' పోర్టల్ను త్వరలో ప్రారంభించనుంది. అయితే ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన భారత్లోనే మొదటి ఏఐ ఆధారిత పోర్టల్ ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేయొచ్చు. రెజ్యుమె తయారీ, ఇంటర్వ్యూలకు కూడా అభ్యర్థులు సిద్ధం కావొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారంతో అనుసంధానమైన ఈ పోర్టల్.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను అందించనుంది.