నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారైందని ఏ1 నిందితుడు చెప్పడంతో సిట్ రంగంలోకి దిగింది. దీంతో జోగి రమేష్ ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు.