Visakhapatnam Tirupati Vande Bharat Express New Train: ఆంధ్రప్రదేశ్ నుండి కొత్త వందేభారత్ రైలును నడపాలని ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖపట్నం-బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్లను నడపాలని ప్రతిపాదించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని, ప్రజలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.