Renigunta Arakkonam 3 And 4 Railway Lines: ఏపీ నుంచి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టారు. ఇటీవల కేంద్రం పలు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం కూడా తెలిపింది. వీటిలో రేణిగుంట నుంచి అరక్కోణం వరకు కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకంతో పాటుగా లాజిస్టిక్స్ కోసం ఈ రైల్వే లైన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. తమిళనాడు నుంచి తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్లేవారికి కూడా ప్రయాణం సులువుగా ఉంటుంది.