Manda Krishna Madiga Rajya Sabha From Ap: ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. బీజేపీకి ఈ సీటు కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రేసుల తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చివరకు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే!