ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో క్షేత్ర స్థాయి పర్యటన చేయనున్నారు. ప్రభుత్వం పనితీరు, సంక్షేమ పథకాల గురించి ప్రజల ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో సుస్థిర విధానాలు అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. జీఎస్టీ 2.0 సంస్కరణలతో అందే లబ్ధితో పాటు తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని వెల్లడించారు. అంతేకాకుండా మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరుపై కూడా సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.