ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఏపీ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గంజాయి, డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు తొలగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు తెలిసింది. అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.