Andhra Pradesh Govt Schemes Kyc Must: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలు పొందుతున్నారా? అయితే మీకో ముఖ్య గమనిక. అర్హులైన వారికే పథకాలు అందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీతో సులభంగా పూర్తి చేయొచ్చు. విద్యార్థులు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. త్వరలో ఈ కేవైసీకి సంబంధించి డెడ్లైన్ ప్రకటించనున్నారు.