Andhra Pradesh Svamitva Scheme Houses Lands: ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ కార్యక్రమం ఊపందుకుంది! 2026 మార్చి నాటికి 45 లక్షల ఇళ్లు, స్థలాలకు ప్రాపర్టీ కార్డులు ఇవ్వాలని టార్గెట్. గ్రామాల్లో దశాబ్దాలుగా యాజమాన్య హక్కులు లేని ఆస్తులకు ఇప్పుడు పూర్తి హక్కులు రానున్నాయి. డ్రోన్ సర్వేలతో ఖచ్చితమైన కొలతలు, సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. ఈ కార్డులతో అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంక్ రుణాలు సులభతరం అవుతాయి. ఈ స్వామిత్వ పథకం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.