AP Govt Regularization Of Sada Bainama Lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామాల క్రమబద్ధీకరణ గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. గ్రామీణ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించే ఈ పథకంలో చిన్న, సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు లభిస్తాయి. అలాగే, బలిమెల, జ్వాలాపుట్ డ్యామ్ల విద్యుత్ సరఫరాకు, కాకినాడలో IIFT క్యాంపస్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టిడ్కో గృహాల నిర్మాణ పురోగతిపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తుంది.