AP Govt Township Plots Concession On Registration Fees 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించింది. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ, రిజిస్ట్రేషన్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్లాట్ విలువను రెండు భాగాలుగా విభజించి, బేస్ ధరపై 7.5% మరియు అభివృద్ధి ఛార్జీలపై 0.5% రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ణయించారు. గతంలో ఉన్న 7.5% ఫీజు విధానాన్ని సవరిస్తూ, ఒకే ప్లాట్ను రెండు దస్తావేజుల కింద రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.