తెలుగు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఈ నేపథ్యంలో.. వాతావరణ శాఖా అధికారులు చల్ల చల్లని కూల్ కూల్ వార్త వినిపించారు. సోమవారం (మార్చి 31న) కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మంగళవారం కూడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని.. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. తద్వారా ఉష్ణోగ్రతల తీవ్రత స్వల్పంగా తగ్గించవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.