AP Govt Officials To Visit Villages On May 21 To 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్వర్ణాంధ్ర సంకల్పం' పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు గ్రామాల్లో మూడు రోజుల పాటు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా, ఇంకా ఏమైనా మార్పులు అవసరమా అనే విషయాలపై ఆరా తీస్తారు. ప్రజల కష్టాలు తెలుసుకొని, పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఈ పల్లెబాట ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.