AP Govt On Rah Veer Scheme Rs 25000 Reward: కేంద్రం దేశవ్యాప్తంగా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా తీవ్రంగా గాయపడితే.. వారిని గోల్డెన్ అవర్ ( తొలి గంటలో) ఆస్పత్రికి తీసుకెళితే రివార్డ్ ఇస్తారు. రూ.25వేలతో పాటుగా ప్రశంసా పత్రం అందిస్తారు. ఈ మేరకు కేంద్రం ఈ పథకాన్ని రహ్ వీర్ పేరుతో అమలు చేస్తోంది. ఏపీలో కూడా ఈ పథకం అమలు చేస్తున్నట్లు రవాణా కమిషనర్ మనీష్కుమార్ సిన్హా తెలిపారు.