రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా 'యూనివర్సల్ హెల్త్ పాలసీ'కి శ్రీకారం చుట్టింది. దీని కింద అర్హులైన కుటుంబాలకు రూ. 2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అవసరమైతే రూ. 25 లక్షల వరకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. తాజాగా టెండరు నిబంధనల్లో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కాగా, ఈ పథకం ద్వారా 1.63 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.